
కురుపాం బాలికల గురుకులం విద్యార్థినులు అనారోగ్యం భారిన పడిన ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు.
తాజా పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నాను. ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వచ్చి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తారని డిప్యూటీ సీఎంవో తెలిపింది.

